Saturday, 22 March 2025 08:34:26 AM
# NPCI: ఇనాక్టివ్ ఫోన్ నెంబర్లకు యూపీఐ సేవల నిలిపివేత # Honey Trap: కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేటు # Posani Krishna Murali: పోసానికి ఊరట... సీఐడీ కేసులో బెయిల్ మంజూరు # Rajitha Mother : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి తల్లి కన్నుమూత.. # తిరుమలలో చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికిచ్చిన 35 ఎకరాలు క్యాన్సిల్.. # Tirumala: నారా దేవాన్ష్​లా మీరూ టీటీడీ అన్నప్రసాదం ట్ర‌స్టుకు విరాళం ఇవ్వొచ్చు.. దేనికి ఎంత ఖర్చు అవుతుందంటే? # Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు.. సోషల్ మీడియాలో హెచ్చరించిన మెగాస్టార్.. # Tech Tips in Telugu : వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి అసలు కారణాలివే.. ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. బ్యాటరీ సేవింగ్ స్మార్ట్ టిప్స్..! # IPL 2025: కొత్తగా మూడు రూల్స్‌ తీసుకొచ్చిన బీసీసీఐ.. అవేంటంటే? # Telangana : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి.. # Chiranjeevi : పీఎం మోదీ ఆ రోజు నాతో ఏం మాట్లాడారంటే.. కన్నీళ్లు వచ్చాయంటూ.. చిరు వ్యాఖ్యలు వైరల్.. # పర్ఫార్మెన్స్, డిజైన్ రెండింటిలోనూ అద్భుతంగా ఉంటుందని స్మార్ట్‌ప్రిక్స్ రిపోర్టు తెలిపింది. ఐక్యూ Z10 సిరీస్‌లో Pro, Z10x వేరియంట్ కూడా ఉంటుందని గతంలో # Telangana Assembly: సై అంటే సై.. అసెంబ్లీలో రగడ.. హరీశ్ రావు వర్సెస్ కోమటిరెడ్డి.. # Gold Price: రాబోయే మూడు నెలల్లో బంగారం ధరలు ఎంతగా పెరుగుతాయో తెలుసా? # MG Comet EV 2025 : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రేంజే వేరబ్బా.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్తుంది..! # Gold: బాబోయ్.. బంగారం రికార్డులే రికార్డులు.. ఆశ్చర్యపరుస్తున్న డబ్ల్యూజీసీ తాజా గణాంకాలు.. 2025 చివరి నాటికి.. # Tata Car Prices : కొత్త కారు కావాలా? ఏప్రిల్‌లో భారీగా పెరగనున్న టాటా PV, EV కార్ల ధరలు.. ఇప్పుడు కొంటేనే బెటర్..! # Mahesh Babu – Sitara : మహేష్ బాబుకే నేర్పిస్తున్న కూతురు సితార.. జెన్ జీ అంటే అట్లుంటది మరి.. వీడియో వైరల్.. # McDonald’s: గుడ్‌న్యూస్‌.. తెలంగాణ నుంచి ఇవి కొనేందుకు మెక్‌డొనాల్డ్స్‌ రెడీ.. ఇక మనవాళ్లకి లాభాలు.. # Affordable SUV Cars : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోపు SUV కార్లు.. టాప్ 5 మోడల్స్ ఇవే..!

CM Revanth Reddy : కోర్టుల్లోనూ కొట్లాడతాం.. హైడ్రాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Date : 11 September 2024 12:43 PM Views : 59

Studio18 News - TELANGANA / : CM Revanth Reddy On Hydra : సీఎం రేవంత్ హైడ్రాపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చెరువులను ఆక్రమించిన వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే హైడ్రా ఏర్పాటు చేశామని రేవంత్ అన్నారు. బుధవారం తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన ప్రాసింగ్ అవుట్ పరేడ్ లో ఆయన ముఖ్యఅతిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా హైడ్రా గురించి మాట్లాడుతూ.. 1908లో హైదరాబాద్ మహానగరంలో వరదలు ఉప్పెనలా కమ్మేసి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ గా నియమించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి హైదరాబాద్ నగరానికి తాగునీటి సౌకర్యం కల్పించింది. ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూ ఆక్రమించి ధనవంతులు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారు. వాళ్లఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజీ గండిపేట నీళ్లలో కలిస్తే.. ఆ నీళ్లు తాగడానికి నగర ప్రజలకు ఇస్తున్నారు.. వాటిని అడ్డుకోకుంటే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్లుగా కాదా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చెరువులను ఆక్రమించి అడ్డగోలుగా నిర్మాణాలు చేయడం వల్ల వరదలు వచ్చి పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నాయి. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం.. చెరువులను ఆక్రమించి ఇల్లు నిర్మించినోళ్లు ఎంత పెద్దోళ్లయినా నిర్మాణాలు కూల్చకుండా వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆక్రమించుకున్న చెరువులను మీరే వదిలిపెట్టి గౌరవంగా పక్కకు తప్పుకోండి.. నీటిపారుదల శాఖకు అప్పగించండి. మీరు ఖాళీచేయనంటే ఉన్నపళంగా నేలమట్టం అవుతాయి. కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో, నాలాల్లో అక్రమంగా నిర్మాణాలను మేం తొలగిస్తాం. మీరు కోర్టులకు వెళ్లినా.. కోర్టుల్లో కొట్లాడతాం. మీ ఆక్రమణలను తొలగిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసీ ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అద్భుతమైన మూసీ డవలప్ మెంట్ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తాం.. పేదవాళ్లకు అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నరు.. రూపాయిరూపాయి కూడబెట్టి గుడిసెలు వేసుకొని ఉన్నరు. వారిపట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరిస్తుంది. మూసీ నాలాలో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 11వేల మందికి అక్కడ ఇళ్లు ఉన్నాయి.. ప్రతివారికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చి వారికి ఇబ్బందిలేకుండా చూస్తామని రేవంత్ పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :