Saturday, 26 April 2025 07:23:28 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీజేపీలో నేతల మధ్య తీవ్రమవుతున్న కలహాలు..! కారణం అదేనా..

Date : 12 September 2024 11:50 AM Views : 105

Studio18 News - TELANGANA / : Gossip Garage : బీజేపీ అంటే క్రమశిక్షణకు మారు పేరు. పార్టీ అధ్యక్షుడు ఏది చెబితే అదే ఫైనల్. పార్టీ తరఫున ఎవరు ఏం మాట్లాడాలన్నా ఓ పద్ధతి ఉంటుంది. ముందుగా అనుకున్న విధంగానే ఎవరైనా మాట్లాడాలి.. కానీ, ప్రస్తుతం పార్టీలో ఆ పరిస్థితులు మారాయంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కమలం నేతల వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లు నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తుండటం వల్ల కమలంలో కలహాలు తీవ్రమవుతున్నాయని టాక్‌ వినిపిస్తోంది. నేతల మధ్య తీవ్రమవుతున్న బేదాభిప్రాయాలు..! తెలంగాణ బీజేపీలో నేతల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రమవుతున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. ఎంతో క్రమశిక్షణ గల కమలం పార్టీని ప్రస్తుతం రెండుగా విభజించి చెబుతున్నారు. 2019కి ముందు 2019 తరువాత బీజేపీ అంటూ పార్టీని రెండుగా విభజిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాతే తెలంగాణలో ఆ పార్టీ బలోపేతమవుతూ వచ్చింది. 2019లో తెలంగాణ నుంచి నాలుగు ఎంపీలు గెలవడంతో కమలం పార్టీలో చేరికలు ఎక్కువయ్యాయి. ఇక ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండగా చేసిన ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పార్టీలో చేరికలు మరింతగా పెరిగాయని చెబుతారు. ఇలా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చాక గతం ఒక తీపి జ్ఞాపకంగానే మిగిలిపోతుందనే టాక్‌ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో ప్రారంభమైన విభేదాలు… ఇప్పటికీ సమసిపోలేదని తాజా ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. నిత్యం అసంతృప్తితో రగిలిపోతున్నారు.. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నేతల్లో కొందరు తమకు సరైన గౌరవం దక్కడం లేదని నిత్యం అసంతృప్తితో రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డికి తగిన ప్రొటోకాల్ ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. తనను చిన్నచూపు చూస్తున్నారని మహేశ్వర్ రెడ్డి భావన.. ఇటీవల వరద ప్రాంతాల బాధితులను పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సూచన మేరకు రెండు బృందాలను నియమించారు. ఇందులో ఒక బృందం కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో ఖమ్మంలో పర్యటించగా, మరొకటి ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలో మహబూబాబాద్‌ వెళ్లింది. అయితే ఈటెల బృందంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని సభ్యుడిగా పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారట. ఒక బృందాన్ని నియమిస్తే బీజేపీ ఎల్పీ నేతగా తాను నేతృత్వం వహించాలని లేదంటే తనను పూర్తిగా మినహాయించాలి కానీ సాధారణ బృంద సభ్యుడిగా ఎలా నియమిస్తారని పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మహేశ్వర్‌రెడ్డి. తనను చిన్నచూపు చూస్తున్నారని భావించిన బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వరద ప్రాంతాల పర్యటనకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎల్పీ లీడర్‌ను ఆహ్వానించకపోవడమేంటని ఆగ్రహం.. ఇదిలా కొనసాగుతుండగానే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఓ ప్రైవేటు హోటల్ లో అట్టహాసంగా చేపట్టారు కమలనాథులు. ఈ కార్యక్రమానికి కనీసం బీజేఎల్పీ నేతను ఆహ్వానించలేదన్న వార్త గుప్పు మంటోంది. మీడియాకు పంపించిన ఇన్విటేషన్ లో కేంద్ర మంత్రులు, ఎంపీల పేర్లు పెట్టినా బీజేఎల్పీ నేత పేరు పెట్టలేదట. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను పిలిచి ఎల్పీ లీడర్‌ను ఆహ్వానించకపోవడమేంటని మహేశ్వర్‌రెడ్డి అనుచరులు నొచ్చుకుంటున్నారని చెబుతున్నారు. ఇదేనా బీజేపీ ఎల్పీ లీడర్‌కు ఇచ్చే మర్యాద? అంటూ ఆగ్రహం.. ఇవి ఈ వారం రోజుల్లో జరిగిన సంఘటనలని.. గతంలో కూడా ఇలాంటి సంఘటలను చాలా ఉన్నాయని అంటున్నారు. ఎల్పీ నేతకి పార్టీ సమావేశాలలో వేదికపైకి ఆహ్వానించడం లేదని, పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా గది ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. చివరికి పార్టీ బ్యానర్లలో మహేశ్వర్‌రెడ్డి ఫొటో కూడా వేయడం లేదని ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా బీజేపీ ఎల్పీ లీడర్‌కు ఇచ్చే మర్యాద? అంటూ మహేశ్వర్‌రెడ్డి కూడా ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీలో చేరిన వారితోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్న సీనియర్లు.. అయితే మహేశ్వర్‌రెడ్డి బాధపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సిద్ధాంతాలు, పార్టీ విధానాలు తెలియకుండా బీజేపీలో చేరిన వారితోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యమైన పదవులు ఇచ్చినా సంతృప్తి చెందడం లేదని, త్యాగాలు చేసి వారికి పదవులు కట్టబెడితే వారిలో సంతృప్తి ఉంటుందని.. పార్టీ లైన్‌ తెలియని వారే ఇలాంటి వాదనలు తెరపైకి తెస్తున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆవేదనను కొట్టిపడేస్తున్నారు బీజేపీ సీనియర్‌ నేతలు. మొత్తానికి ఈ వ్యవహారం పరిశీలిస్తే బీజేపీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం ఇప్పటికీ కుదరడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :