Monday, 17 February 2025 04:28:57 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Kishan Reddy: రాజకీయాలకు అతీతంగా వీరిని ఆదుకుందాం: కిషన్ రెడ్డి

Date : 08 September 2024 04:39 PM Views : 59

Studio18 News - TELANGANA / : ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం రాకాశితండా గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితరులు పర్యటించారు. ముంపు బాధితుల ఇంటింటికి తిరిగి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ…వర్షాలకి ప్రజలు సర్వం కోల్పోయారని, చూస్తుంటే బాధేస్తోందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆదుకుందామని, రాష్ట్ర ప్రభుత్వం వరద బాధిత సహాయక కార్యక్రమాలు వేగవంతం చేయాలని కిషన్ రెడ్డి చెప్పారు. తుపాను వస్తుందని, మరింతగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం దయనీయమైన పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన తరువాత కేంద్ర బృందాలను పంపించి పంట నష్టం, పశు సంపద ప్రాణాలు కోల్పోయిన వారికి వికాస్ మేనేజ్మెంట్ కింద సహాయం చేస్తామని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఎస్డీఎఫ్ నిధుల ద్వారా తాత్కాలిక సహాయం చేయాలని అన్నారు. పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి ఇవ్వాలని, బాధితులను ఆదుకుంటామని చెప్పారు. మరోవైపు, మున్నేరు వరద ముంపునకు గురై నిరాశ్రయులైన వారికి నిత్యావసర సరుకులు, దుప్పట్లను పంపిణీ చేశారు కిషన్ రెడ్డి. వరద బాధితులకు కేంద్ర సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :