Friday, 14 February 2025 06:29:19 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

వరద సహాయంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం

Date : 08 September 2024 02:44 PM Views : 52

Studio18 News - TELANGANA / : TS Congress Party : కుండపోత వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మున్నేరు ఉప్పొంగడంతో ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు, పలు జిల్లాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో వరద బాధితులకు సహాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులకోసం రెండు నెలల జీతాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు తమ రెండు నెలల జీతాన్ని సీఎం సహా ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారులుసైతం తమ రెండు నెలల జీతం సీఎం సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి, కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు వరద బాధితులకు అండగా నిలిచారు. పార్టీపరంగా బాధితులను ఆర్థికంగా ఆదుకోవాలని అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నెల జీతాన్ని వరద బాధితులకు వితరణగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గత మూడు రోజుల క్రితం ఎక్స్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :