Friday, 14 February 2025 07:26:57 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

రోడ్లపైకి వచ్చి కొట్లాడాలి.. విద్యార్థుల సమస్యలపై గళం విప్పాలి: బండి సంజయ్

Date : 08 September 2024 04:00 PM Views : 112

Studio18 News - TELANGANA / : కాంగ్రెస్ ఉన్నంత కాలం టీచర్ల సమస్యలు తీరవని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ తపస్ సంఘం నిర్వహించిన ‘గురు వందనం’లో పాల్గొని పలువురు ఉత్తమ టీచర్లను బండి సంజయ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్లపైకి వచ్చి కొట్లాడాలని, విద్యార్థుల సమస్యలపై గళం విప్పాలని చెప్పారు. టీచర్లు తలుచుకుంటే ప్రభుత్వ తలరాత మారుతుందని చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే వాళ్లకు తాను సంపూర్ణంగా మద్దతిస్తానని తెలిపారు. కాంగ్రెస్ కు ఓట్లేస్తే టీచర్లకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు. టీచర్ల కోసం తాము పోరాడి జైలుకు వెళ్లామని, కాంగ్రెస్ ను గెలిపించడం ఎంతవరకు సమంజసమని అడిగారు. ఉద్యోగులకు మొదటి నెల జీతం బీజేపీ పోరాట ఫలితమేనని అన్నారు. 317 జీవోతో టీచర్లు అల్లాడితే ఉపాధ్యాయ సంఘాలెందుకు నోరు విప్పలేదని అడిగారు. టీచర్ల పక్షాన కొట్లాడి జైలుకు వెళ్లిన ఏకైక సంఘం తపస్ మాత్రమేనని అన్నారు. బీఈడీ అర్హతలున్న ఎస్జీటీ టీచర్లకు ప్రమోషన్లలో న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :