Monday, 17 March 2025 10:37:35 PM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

Ganesh Nimajjanam: నిమజ్జనానికి తరలివస్తున్న గణనాథులు.. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..

Date : 16 September 2024 01:34 PM Views : 75

Studio18 News - TELANGANA / : Ganesh Nimajjanam 2024: జంట నగరాల్లో వినాయక చవితి నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో విగ్రహాలన్ని నిమజ్జనంకు తరలుతున్నాయి. ఆదివారం రాత్రి ట్యాంక్ బండ్ వద్దకు నిమజ్జనానికి భారీగా గణనాథులు తరలివచ్చాయి. భక్తులు శోభాయాత్రలో క్యూ కట్టారు. ఉదయం నుంచి ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, అబిడ్స్, లిబర్టీ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ తో వాహనాలు ఏమాత్రం ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. గణేశ్ నిమజ్జనాలతో హైదరాబాద్ లోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం రాత్రి నిమజ్జనానికి ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ కు పెద్దెత్తున మండపంలోని గణనాథులు బయలుదేరాయి. దీంతో సోమవారం ఉదయం 5గంటల వరకు కూడా గణేశ్ నిమజ్జన వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. హుస్సేన్ సాగర్, కవదిగూడ, బైబిల్ హౌస్, ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, లక్డీకాపూల్, లిబర్టీ, నాంపల్లి, మొజంజాహి మార్కెట్, జామ్ బాగ్, బేగం బజార్, అయోధ్య జంక్షన్, టెలిఫోన్ భవన్ తదితర ప్రాంతాల్లో తీవ్ర భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో గంటల తరబడి దారి పొడవునా వాహనా0లు000 నిలిచిపోయాయి. హుస్సేన్ సాగర్ కు నిమజ్జనానికి తీసుకొచ్చే గణనాథులతో నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి అసెంబ్లీ, లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతోవాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. హాలిడే కావడంతో గణేశ్ నిమజ్జనాలను తిలకించేందుకు నగరవాసులు ఉదయాన్నే రోడ్లపైకి వచ్చారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 6గంటలకు ఖైరతాబాద్ గణేశ్ శోభయాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ అర్ధరాత్రి కలశపూజ అనంతరం ట్రాలీపైకి గణనాథుడును తీసుకెళ్తారు. రేపు ఉదయం 6గంటల నుంచి ఖైరతాబాద్, సెన్సేషనల్ థియేటర్, రాజ్ దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ప్లై ఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గలో శోభయాత్ర కొనసాగనుంది. ఎన్డీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన 4వ నెంబర్ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం చేయనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :