Sunday, 29 March 2026 05:24:08 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..?

Date : 06 December 2025 06:57 PM Views : 365

Studio18 News - TELANGANA / MEDCHAL-MALKAJGIRI : హైదరాబాద్ నగరపాలక సంస్థ నీటి సరఫరా విభాగం నిద్దరోతోంది. పైపులైన్లకు అడ్డగోలుగా లీకేజీలు ఏర్పడుతన్నా పట్టించుకోవడం లేదు. నెలరోజులుగా ప్రధాన రహదారిపై మంజీర వాటర్ పైప్ లీకేజీ కావాడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నీరు వృథాగా పోతున్నా జలమండలి, మున్సిపల్ అధికారులు కనిపించకపోవడం అనేది హైదరాబాద్‌తో సహా అనేక పట్టణాల్లో నీటి నిర్వహణలో ఉన్న నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ముందు గత నెలరోజులుగా మంజీర పైప్ లీకేజీ అయింది. దీంతో వేలాది లీటర్ల నీరు వృథాగా పోతూ ప్రధాన రహదారి వెంబడి కూరగాయల మార్కెట్ వరకు రోడ్డుపై పారుతుంది. నీరు ప్రవహిస్తూ ఉండడంతో రోడ్డంతా చిత్తడిగా మారి వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే ప్రధాన రహదారి కూడా నీటితో కొంచెం కొంచెం పూర్తిగా చెడిపోయి.. గుంతలుగా మారే అవకాశముంది. నిత్యం వేలాది మంది ప్రజలు, వాహనదారులు ప్రయాణం కొనసాగించే ప్రధాన రహదారిపై చాలా రోజుల నుండి మంజీర నీరు వృథాగా పోతున్నా.. జలమండలి, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ పట్టించుకున్న పాపాన పోలేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి పైపులైన్ లు.. సరఫరాలో ఉన్న లోపాలతో తరచూ రోడ్లపై పైపులైన్లు లీకవుతున్నాయి. లీకేజీలతో వృథాగా ప్రవహిస్తున్న నీటితో రోడ్లు పాడవుతున్నాయి. లీకేజీలతో సరఫరా చేస్తున్న నీరు రంగుమారుతుందని నగరవాసులు పేర్కొంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి లీకేజీ కాకుండా మరమ్మత్తులు చేసి సమస్య పరిషర్కరించాలని స్థానిక ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :