Studio18 News - TELANGANA / HYDERABAD : దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఎన్.జి.ఓస్ కాలనీ గ్రంథాలయ పనులు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని ఎల్.బి.నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఎన్.జి.ఓస్ కాలనీ పెద్దలు మరియు కాలనీవాసులు లైబ్రరీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు గ్రంథాలయ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గ్రంథాలయ పనులను తాను ఎప్పుడూ ఆపలేదని, కొందరు బీజేపీ కార్పొరేటర్ల చర్యల కారణంగా పనులు నిలిచిపోయాయని తెలిపారు. గ్రంథాలయ పనులను రేపటి నుండి ప్రారంభించాలని అక్కడే ఉన్న గ్రంథాలయ ఈఈ మరియు డీఈలకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుండి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని మరియు బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ భారస పార్టీ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్.జి.ఓస్ కాలనీ పెద్దలు సోమయాజులు, పంపన్న వెంకటేశ్వర, శివనాగేశ్వర్ రావు, వేముల జైపాల్ రెడ్డి, వర్ధని, శశిధర్ రెడ్డి, ఓంప్రకేష్, భూషణ్, విశ్వనాథం, శ్యాంకుమార్, ఆనంద్, చుట్టుపక్కల కాలనీ పెద్దలు మరియు భారస నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అనిల్ చౌదరీ, యూత్ అధ్యక్షుడు మునగాల రాఘవేందర్ రావు, కొంగర మహేష్, నీళ్ల రాజశేఖర్ గౌడ్, నరేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, అమర్థ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News