Studio18 News - TELANGANA / RANGAREDDY : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలకు సీసీ రోడ్లు మరియు ఇతర సివిల్ వర్క్స్ మంజూరు చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్ నూతనంగా నియమితులైన మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం సభ్యులు భావన శ్రీనివాస్, గోపాల్ దాస్ రాము లు మధుయాష్కి గౌడ్ మరియు కమిషనర్ను కలిసి పిచ్చుక గూళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాలని ఆహ్వానించారు. మధుయాష్కి గౌడ్ సమర్పించిన వినతి పత్రాన్ని స్వీకరించిన కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ నిధుల మంజూరు కోసం చీఫ్ ఇంజినీర్కు లేఖ రాశారు. కొత్త కమిషనరేట్కు బ్యాంక్ ఖాతా ప్రారంభమై, నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ నెలలో నిధులు బదిలీ అయిన అనంతరం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గాయత్రి నగర్, బ్యాంక్ కాలనీతో పాటు పలు డివిజన్లలో రోడ్లు మరియు మౌలిక వసతుల అభివృద్ధి జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
Admin
Studio18 News