Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండల కేంద్రంలో శనివారం నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని, పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి రమేష్ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్పల్లి మండలంలోని నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ధర్పల్లి ప్రభుత్వ పాఠశాల, ఆదర్శ పాఠశాల, దుబ్బాక ప్రభుత్వ పాఠశాల, రామడుగు ప్రభుత్వ పాఠశాల కేంద్రాల్లో మొత్తం 542 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు సమయానికి ముందే చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు మంచినీరు సహా అవసరమైన మౌలిక వసతులు కల్పించామని, పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
Admin
Studio18 News