Saturday, 14 March 2026 09:26:25 PM
# పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా # రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు # జిల్లాలో జనాభా గణన–2025 కోసం చర్యలు ప్రారంభం # పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం # పెద్దమ్మ తల్లి 27వ వార్షికోత్సవంలో ఘనంగా బోనాల ఉత్సవం # రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ # కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి # సికింద్రాపూర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు # కేంద్ర నిధులతో అక్కాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన # రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ # ధర్పల్లి మండలంలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం # రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి # జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసిన కలెక్టర్

నారాయణపురం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తుల ఆందోళన

Date : 13 March 2026 02:48 PM Views : 6

Studio18 News - TELANGANA / KARIMNAGAR : కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నారాయణపురం గ్రామంలో ఈరోజు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని వెంటనే ముంపు గ్రామంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో సుమారు ఏడు ట్రాక్టర్లలో గ్రామస్థులు కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. అప్పటి ఎమ్మెల్యే రవిశంకర్ గ్రామానికి వచ్చి నారాయణపురాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి, గ్రామస్తులకు నష్టపరిహారం ఇచ్చి వేరే ప్రాంతంలో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మేడిపల్లి సత్యం కూడా ఎన్నికల ముందు నెలకు ఒకసారి గ్రామానికి వచ్చి, గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి అందరికీ వేరే చోట ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల వరకు ప్రతి నెలా గ్రామానికి వచ్చారని, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. “సత్యం సార్ మా మీద కోపం పెట్టుకోకండి. మాపై కక్ష పెంచుకుని ఇబ్బందులు పెట్టకండి. వెంటనే మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి అందరికీ వేరే చోట ఇళ్లు నిర్మించాలి” అని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వర్షాలు పడినప్పుడు ప్రతి ఇంటిలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున రోడ్డుపై ధర్నా చేస్తామని హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :