Saturday, 14 March 2026 09:49:57 PM
# పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా # రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు # జిల్లాలో జనాభా గణన–2025 కోసం చర్యలు ప్రారంభం # పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం # పెద్దమ్మ తల్లి 27వ వార్షికోత్సవంలో ఘనంగా బోనాల ఉత్సవం # రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ # కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి # సికింద్రాపూర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు # కేంద్ర నిధులతో అక్కాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన # రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ # ధర్పల్లి మండలంలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం # రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి # జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసిన కలెక్టర్

మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు

Date : 11 March 2026 06:05 PM Views : 13

Studio18 News - TELANGANA / KHAMMAM : మధిర బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం బుధవారంతో ముగిసింది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, సీనియర్ న్యాయవాది చింతల గోపాల్ వెల్లడించారు. చివరి రోజు అధ్యక్ష పదవికి బోజెడ్ల పుల్లారావు, పల్లపోతు కృష్ణారావు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ పదవి కోసం చావలి రామరాజు, కావూరు రమేష్ నామినేషన్ దాఖలు చేయగా, తాజాగా మరో ఇద్దరు నామినేషన్ వేయడంతో మొత్తం అధ్యక్ష పదవి కోసం నలుగురు పోటీలో ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యక్ష పదవికి భైరవ భట్ల వెంకటరమణ, సూరం శెట్టి సునీత నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శి పదవికి గంధం శ్రీనివాసరావు, కోట జ్ఞానేష్, పల్లపోతు కృష్ణారావు నామినేషన్ దాఖలు చేయగా, కోశాధికారి పదవికి తూములూరి సంధ్య నామినేషన్ దాఖలు చేశారు. జాయింట్ సెక్రటరీ-1 పదవికి భైరవభట్ల వెంకటరమణ, కోటా రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. కోశాధికారి పదవికి తూములూరి సంధ్య, మహిళా ప్రతినిధి పదవికి మాధురి తేజ, జాయింట్ సెక్రటరీ-2 పదవికి సూరం శెట్టి సునీత ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో వారి నామినేషన్లు సక్రమంగా ఉంటే వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారి తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :