Saturday, 14 March 2026 08:07:31 PM
# పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా # రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు # జిల్లాలో జనాభా గణన–2025 కోసం చర్యలు ప్రారంభం # పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం # పెద్దమ్మ తల్లి 27వ వార్షికోత్సవంలో ఘనంగా బోనాల ఉత్సవం # రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ # కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి # సికింద్రాపూర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు # కేంద్ర నిధులతో అక్కాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన # రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ # ధర్పల్లి మండలంలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం # రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి # జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసిన కలెక్టర్

మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం

Date : 14 March 2026 03:44 PM Views : 116

Studio18 News - TELANGANA / KARIMNAGAR : మండుటెండలో కార్యకర్తల హోరులో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. రామడుగు మండలంలో జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో కేంద్ర మంత్రి అడుగుల వేగాన్ని తగ్గించారు. రామడుగు మండలం కోన్ రావుపేట సమీపంలో పెద్ద ఎత్తున నడుస్తున్న కార్యకర్తల జోష్ దృశ్యాలను చిత్రీకరించేందుకు కార్యకర్తలు డ్రోన్ ఎగరేశారు. అయితే ఆ డ్రోన్ అక్కడే చెట్టుపైనున్న తేనెతుట్టెను తాకడంతో తేనెటీగలు బయటకు వచ్చి కాసేపు గందరగోళం నెలకొంది. తేనెటీగలు కొందరు కార్యకర్తలపై దాడి చేయడంతో అప్రమత్తమైన బండి సంజయ్ పరిస్థితిని గమనించారు. గాయపడ్డ కార్యకర్తలకు డాక్టర్లు చికిత్స అందించారు. అనంతరం కొద్ది దూరం వెళ్లి చెట్టు కింద బండి సంజయ్ సేదదీరగా వైద్యులు కేంద్ర మంత్రికి రొటీన్ చెకప్ నిర్వహించారు. కొద్ది నిమిషాల అనంతరం బండి సంజయ్ మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికే సుమారు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేసిన ఆయన కాసేపట్లో గంగాధర మండల కేంద్రానికి చేరుకోనున్నారు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి పాదయాత్ర కొనసాగించనున్న కేంద్ర మంత్రి సాయంత్రం 6.30 గంటల వరకు కొండగట్టుకు చేరుకోవాలనే దీక్షతో మండుటెండలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :