Studio18 News - TELANGANA / NIZAMABAD : జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్లో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం శుక్రవారం కన్నుల పండువగా నిర్వహించగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సకుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం గర్భగుడిలో రంగనాయక స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సమేతంగా అన్నప్రసాదం స్వీకరించారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు డప్పు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. పలువురు గ్రామస్తులు ఆలయ నిర్మాణం విషయమై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి విన్నవించగా తప్పకుండా తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ ఆలయ నిర్మాణంతో పాటు గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల వరకే పార్టీలు అని, గెలిచిన తర్వాత అభివృద్ధే పరమావధి అని పేర్కొన్నారు. రాజకీయ భేషజాలకు పోకుండా గ్రామస్తులు ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కారం చూపిస్తానని సూచించారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు చిన్నా రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ముసుకు సాయి రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కౌలాస్ మోహన్, మాజీ ఎంపీపీ మైదం రాజన్న, పార్టీ యువ నాయకులు ఉమ్మాజి నరేష్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, పెద్దలు, పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Studio18 News