Friday, 18 July 2025 06:14:19 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్

Date : 26 January 2025 12:41 AM Views : 478

Studio18 News - TELANGANA / JOGULAMBA GADWAL : దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉన్నందని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకొని సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కాంప్లెక్స్ నుండి కృష్ణవేణి చౌక్ వరకు నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో అధికారులు,విద్యార్థులు పాల్గొని ప్లే కార్డులు చేతబట్టి మన ఓటు – మన హక్కు, ఓటు ఈజ్ యువర్ వాయిస్ వంటి నినాదాలతో ఓటు ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు నమోదు చేయించి, ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు అనేది పౌరుడి హక్కు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధమని అన్నారు. మీ అభిప్రాయం ప్రభుత్వానికి చేరాలంటే, పాలసీ మేకింగ్‌లో మీ వంతు పాత్ర ఉండాలంటే , ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని పేర్కొన్నారు.నేటి విద్యార్థులే రేపటి పౌరులు, అందుకే వారిలో ఓటు ప్రాముఖ్యత పై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి పౌరుడి బాధ్యతలో ప్రధానమైనది ఓటరుగా నమోదు కావడం, ఓటు హక్కును వినియోగించుకోవడమని తెలిపారు.ఓటు వేయడం ద్వారానే మీ వాయిస్ ను ప్రభుత్వానికి చేరవచ్చు,” అని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 17 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా నమోదు అయ్యే అవకాశం కల్పించిందని అన్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుకోవాలని, ఆన్‌లైన్‌లో కూడా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వచ్చి ఈ ప్రక్రియను సులభతరం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ప్రదేశంలో ఓటింగ్ అందుబాటులో ఓటు హక్కును అందరికీ చేరువ చేయడానికి ప్రభుత్వం దూర ప్రాంతాలు, దీవులు, లేదా అందుబాటులోకి రాని వంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని గుర్తు చేశారు. జిల్లాలో గుర్రం గడ్డ గ్రామం వంటి దివి ప్రాంతాల్లోకి బోట్ లైన్ల ద్వారా ఓటర్లను చేరుకోవడం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఇంత కృషి చేస్తున్నా, పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు,పల్లెల్లో ఓటింగ్ శాతం మంచి స్థాయిలో ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని తమ హక్కును వినియోగించుకోవాలని అన్నారు. మీరు ఎక్కడ ఉన్నా ఎన్నికల సమయంలో కచ్చితంగా ఓటు వేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతగా పేర్కొంటూ, అందరూ ఓటర్లుగా నమోదు చేసుకుని అవగాహన పెంపొందించి, తమ ఓటు హక్కును వినియోగించడం ద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని అన్నారు.ఆ తర్వాత, ర్యాలీలో పాల్గొన్న అందరూ ఓటర్ ప్రమాణం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గోన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :