Sunday, 29 March 2026 05:25:41 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..!

Date : 07 February 2026 07:00 PM Views : 111

Studio18 News - TELANGANA / HYDERABAD : షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందన్న డీసీపీ శిల్పవల్లి ఏయే ఫైళ్లు కాలిపోయాయనే దానిపై స్పష్టత రావాలన్న డీసీపీ మంటలను తొలుత ఆఫీస్ బోయ్ గమనించాడని వెల్లడి హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంపై సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందిస్తూ... ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. ఉదయం 10 గంటలకు అగ్నిప్రమాదంపై సమాచారం అందిందని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. భవనం తొలి అంతస్తులో కంప్యూటర్లు ఉంటాయని డీసీపీ తెలిపారు. మంటల్లో ఏయే ఫైళ్లు కాలిపోయాయనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. మంటలను ఆఫీస్ బోయ్ తొలుత గమనించాడని... వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేశాడని తెలిపారు. ఈ క్రమంలో అతడు అస్వస్థతకు గురయ్యాడని... వెంటనే 108లో ఆసుపత్రికి తరలించడం జరిగిందని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు ఉద్యోగులు లోపల ఉన్నారని... మంటలను గమనించిన వెంటనే వారు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. డీఎఫ్ఓ శ్రీదాస్ మాట్లాడుతూ... మొదటి అంతస్తులో పలు కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించిందని చెప్పారు. విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయాయని వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నామని... అప్పటికే మంటలు వ్యాపించాయని తెలిపారు. రెండో అంతస్తులో కెమికల్ ల్యాబ్ ఉందని... అయితే, మంటలు రెండో అంతస్తుకు వ్యాపించలేదని చెప్పారు. తొలి అంతస్తులో ఉన్న సున్నితమైన ప్లాస్టిక్ వస్తువులు ఆహుతయ్యాయని తెలిపారు. హార్డ్ డిస్కులు పూర్తిగా కాలిపోయాయా? లేదా పాక్షికంగా కాలాయా? అనేది పరిశీలించాల్సి ఉందని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :