Studio18 News - TELANGANA / SANGAREDDY : పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు, సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే మాద్రి పృథ్వీరాజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అమీన్పూర్లోని మహిమా మినిస్ట్రీస్లో MPR యువసేన సభ్యులు నిర్వహించిన జన్మదిన వేడుకలకు MDR ఫౌండేషన్ అధ్యక్షుడు మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వారికి ప్రత్యేకంగా భోజనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం చిన్నారులు మాద్రి పృథ్వీరాజ్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సమాజ సేవలో ముందుండే నాయకుడిగా పృథ్వీరాజ్ మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని చిన్నారులు మరియు కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో MPR యువసేన సభ్యులు, స్థానిక నాయకులు, అభిమానులు మరియు చిన్నారులు పాల్గొన్నారు.
Admin
Studio18 News