Sunday, 15 March 2026 03:33:06 PM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ

Date : 15 March 2026 08:39 AM Views : 43

Studio18 News - TELANGANA / SANGAREDDY : పటాన్‌చెరు నియోజకవర్గం భారతినగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీ మసీదులో ఈరోజు రంజాన్ సందర్భంగా పేద ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గం ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, భారతినగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి మసీదు సదర్ సమద్, ఖలీల్ హాజరై ఏర్పాట్లను పర్యవేక్షించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని అవసరమైన కుటుంబాలకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పర్వదినం సోదరభావం, దానం, సహకారం అనే విలువలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పేదలకు సహాయం చేయడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, మైనారిటీ నాయకులు ఘౌస్, అజీముద్దీన్, కుతుబుద్దీన్, జాకీర్, షకీల్, జావిద్, బాబా, శ్యామ్, జైపాల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు హాజరయ్యారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :