Studio18 News - TELANGANA / RANGAREDDY : శనివారం ప్రారంభమైన పదవ తరగతి (SSC) వార్షిక పరీక్షలను రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలను రాయాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. కష్టపడి చదివిన విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షల్లో చక్కగా ప్రదర్శించి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ వారి భవిష్యత్తు విజయాలకు తోడ్పడాలని కోరారు. ఈ పరీక్షల్లో ప్రతి విద్యార్థి విజయం సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు.
Admin
Studio18 News