Monday, 23 June 2025 03:05:31 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

#karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు

Date : 26 January 2025 12:57 AM Views : 465

Studio18 News - TELANGANA / KARIMNAGAR : కరీంనగర్ మేయర్ సునీల్​రావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్​ బై చెప్పి బీజేపీలో చేరారు. ఈ మేరకు సునీల్​రావుకు కేంద్రమంత్రి బండి సంజయ్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. కరీంనగర్ స్మార్ట్‌ సిటీ నిధుల విషయంలో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అండగా ఉన్నందువల్ల అభివృద్ది కొనసాగాలని బీజేపీలో చేరుతున్నట్లు మేయర్‌ సునీల్‌రావు స్పష్టం చేశారు. అవినీతి అక్రమాల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం తనకు లేదని ఎక్కడ కూడా అవినీతి అవకతవకలు జరగలేదని ఘంటాపదంగా చెప్పగలనని అన్నారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్​రావు ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గంగులకు కమీషన్లు ముడితే చాలని పనుల గురించి పట్టించుకోరని విమర్శించారు. కరీంనగర్​లో జరిగిన ప్రతి కుంభకోణంలో గంగుల పాత్ర ఉందని సునీల్ మండిపడ్డారు. బండి సంజయ్ కృషితోనే కరీంనగర్ అభివృద్ధి జరిగిందని వివరించారు. కరీంనగర్ అభివృద్ధిని గంగుల ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. నగరాభివృద్ధి ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే తాను ఇంతకాలం మౌనంగా ఉన్నానని స్పష్టం చేశారు. రోడ్లు, చెక్​డ్యామ్​ల కాంట్రాక్టర్లు అందరూ బినామీలేనని విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్​పై కాషాయ జెండా ఎగురవేస్తామని విమరించారు. త్వరలో మరికొందరు కార్పొరేటర్లు బీజేపీలో చేరతారని సునీల్​రావు అన్నారు. పార్టీలో కొందరు అనుయాయులతో తనపై విమర్శలు చేయిస్తున్నారో తనకు తెలుసని సునీల్​రావు వివరించారు. తనపై విమర్శలు చేయిస్తున్న వారు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారో నా దగ్గర చిట్టా మొత్తం ఉందన్న ఆయన త్రిబుల్ వన్‌ జీఓలో భూములు ఎక్కడెక్కడ కొన్నారో, ఖాజీపూర్‌ ఇసుక క్వారీ అక్రమాలు, మానేరు రివర్‌ ఫ్రంట్‌లో జరిగిన అవినీతి గురించి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోవల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :