Saturday, 26 April 2025 07:25:49 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy: ఓడిపోయాక బీఆర్ఎస్ వాళ్లు వేరే దేశానికి వెళ్లి బ్రతుకుతారని భావించా: మంత్రి కోమటిరెడ్డి

Date : 19 October 2024 04:32 PM Views : 86

Studio18 News - TELANGANA / : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్లు వేరే దేశానికి వెళ్లి బ్రతుకుతారని భావించానని... కానీ సిగ్గు లేకుండా ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలా వివిధ పథకాల పేర్లతో రూ.7 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వంద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చామని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని, కానీ మేం చేసేదే చెప్పామన్నారు. "అరె పిచ్చి కేటీఆర్... మీలాగా అమలు చేయలేని హామీలు మేం ఇవ్వలేదు. ఎంత కష్టమైనా నెల మొదటి రోజే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం" అన్నారు. "కేటీఆర్, హరీశ్ రావుకు ఏం పుట్టింది... మీకు రాజకీయాలు చేయడం తెలుసా?" అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. నల్గొండలో అనారోగ్యం బారినపడిన వారు చాలామంది ఉన్నారని, ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఫ్లోరైడ్, మరోవైపు కోటిన్నర మంది వాడిన నీరు నల్గొండలో పారుతోందన్నారు. మురుగు శుద్ధి కేంద్రాలతో సమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నారు. నగరానికి స్వచ్ఛమైన నీరు అందించాలని వ్యాఖ్యానించారు. ఫ్లోరైడ్‌కు శాశ్వత పరిష్కారం ఎస్‌ఎల్‌బీసీయే అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ, మూసీ జల శుద్ధీకరణ అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన అభినందించారు. కేసీఆర్ కొడుకు అంటే అందరూ గుర్తు పడతారని, కానీ కేటీఆర్ అంటే ఆయనను ఎవరూ గుర్తు పట్టరని ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయినప్పటికీ కేటీఆర్‌కు అహం తగ్గలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని దేశాలు తిరిగి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు కేటీఆర్ రెచ్చగొడితే రెచ్చిపోరని, తమకు స్వతహాగా పౌరుషం ఉందన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :