Studio18 News - TELANGANA / ADILABAD : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నవోదయనగర్కు చెందిన ఆత్రం గంగుబాయి బిడ్డకు జన్మనిచ్చి స్వర్గస్తులైన విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితం ఆమె భర్త కూడా మరణించడంతో చిన్నారులు అనాధలయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి చిన్న పిల్లలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఏవైనా అవసరాలు ఉన్నా తెలియజేయాలని సూచిస్తూ రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే చిన్నారి పెద్దయ్యే వరకు పాలు, పోషణ ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టీచర్ బలిరామ్ కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News