Studio18 News - TELANGANA / SANGAREDDY : సోమవారం పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి పండుగల తేదీల నిర్ణయానికి నిర్వహించిన సమావేశానికి పట్టణ ప్రముఖులు, వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో శ్రీరామనవమి వేడుకల నిర్వహణ కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ తన వంతుగా రూ.1,51,000 విరాళాన్ని ప్రకటించారు. ప్రకటించిన ఆ మొత్తాన్ని ఈరోజు ఉదయం రామ మందిరంలో ఆలయ నిర్వాహకులకు అందజేశారు. గత 45 సంవత్సరాలుగా పట్టణ పెద్దలు కొనసాగిస్తున్న ఆచార సాంప్రదాయాలను తాను కూడా తరువాతి తరం నాయకులతో సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా కొనసాగిస్తానని తెలిపారు. సమాజం అంతా ఒకే తాటిపై నిలిచి అన్ని పండుగలను కలిసి జరుపుకునే విధంగా ముందుకు తీసుకెళ్తానని మరోసారి స్పష్టం చేశారు.
Admin
Studio18 News