Thursday, 12 March 2026 12:05:59 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

KTR: 'నీకు బాగా తెలిసిన ఆ ప‌ని చేసుకోవ‌డం మంచిదమ్మా చిట్టి'.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెటైర్‌!

Date : 17 September 2024 03:19 PM Views : 496

Studio18 News - TELANGANA / : సీఎం రేవంత్ రెడ్డి కంప్యూటర్ వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కౌంట‌ర్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సెటైర్లు వేశారు. "కంప్యూటర్‌ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు చార్లెస్ బాబేజీ. దేశానికి కంప్యూట‌ర్‌ పరిచయం చేసిందీ రాజీవ్ కాదు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటోమేటిక్ కాలిక్యులేటర్ (టీఐఎఫ్ఆర్ఏసీ) వారు 1956లో ఇండియాలో తొలిసారిగా కంప్యూటర్ సేవలు ప్రారంభించారు. రాజీవ్ గాంధీకి అప్పటికి 12 ఏళ్లు. ఏదో నోటికొచ్చింది వాగడం, ఆ తర్వాత దొరికిపోవడం ఎందుకు నీకు బాగా తెలిసిన రియల్ ఎస్టేట్ దందాలు, బ్లాక్ మెయిల్‌ వీటికి పరిమితమైతే మంచిదమ్మా చిట్టి" అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా, సోమ‌వారం రాజీవ్ గాంధీ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. "ఇప్పుడు ట్విట్ట‌ర్ పిట్ట‌ ట్విట్ట‌ర్‌లో పోస్టులు పెడుతున్నాడు. అమెరికా వెళ్లి కంప్యూట‌ర్ చ‌దువుకున్నా అని చెబుతున్నాడు. ఆ కంప్యూట‌ర్‌ను ఈ దేశానికి తెచ్చిందే రాజీవ్ గాంధీ. ఆయ‌న లేక‌పోతే నువ్వు గుంటూరులో ఇడ్లీ, వ‌డ అమ్ముకునేవాడివి. సిద్దిపేట రైల్వే స్టేష‌న్‌లో చాయ్‌, స‌మోసా అమ్ముకునేవాడివి" అని కేటీఆర్‌పై ముఖ్య‌మంత్రి సెటైర్ వేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :