Studio18 News - TELANGANA / RANGAREDDY : జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ గ్రామ శివారులో గల ఈసీ వాగు నుండి అక్రమార్కులు అక్రమంగా తరలించిన ఇసుకను అధికారులు సీజ్ చేశారు. సుమారు 30 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా డంప్ చేసినట్లు గుర్తించి షాబాద్ తహశీల్దార్ శనివారం చర్యలు తీసుకున్నారు. సీజ్ చేసిన ఈ ఇసుకను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు షాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సమక్షంలో బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిపారు. ఈ వేలంపాటలో ఆసక్తిగలవారు పాల్గొనాలని అధికారులు సూచించారు.
Admin
Studio18 News