Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం మూడో వార్డు మున్సిపల్ ఎన్నికల సమయంలో వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలను కౌన్సిలర్ బెడ్డల సౌజన్య నెరవేర్చుతున్నారు. అంబేద్కర్ నగర్కు చెందిన పద్మ మరణించగా విషయం తెలుసుకున్న కౌన్సిలర్ సౌజన్య మృతదేహానికి నివాళులు అర్పించి అంత్యక్రియల కోసం రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. వార్డులోని ఏ ఒక్క నిరుపేదకు ఆపద వచ్చినా దగ్గర ఉండి ఆదుకుంటానని ఆమె పేర్కొన్నారు.
Admin
Studio18 News