Studio18 News - TELANGANA / MEDCHAL-MALKAJGIRI : భాగ్యనగర నందనవనం (నారపల్లి) పార్కులో ఆదివారం ఉదయం ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్ 3.0 (East Hyderabad Arogya Run 3.0) ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరుగు పందెం కార్యక్రమంలో ఆర్గనైజర్ ప్రభాకర్ ఆహ్వానం మేరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నవీన్ రెడ్డి, సీఐ మక్బుల్ జానీ, మాజీ కార్పొరేటర్ యుగేందర్ రెడ్డి, తుంగతుర్తి రవి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. అనంతరం తుంగతుర్తి రవి మాట్లాడుతూ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. నిత్యం వ్యాయామం, పరుగు వంటి అలవాట్లు మనిషిని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచుతాయని, యువత సెల్ఫోన్లకు పరిమితం కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపాలని కోరారు. భాగ్యనగర నందనవనం వంటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నగరవాసులకు స్వచ్ఛమైన గాలి, మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపారు. తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో ఫిట్నెస్పై అవగాహన కల్పిస్తున్న రాచకొండ రన్నర్స్ బృందం మరియు వాలంటీర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రన్నర్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News