Studio18 News - TELANGANA / ADILABAD : అర్థనగ్న ప్రదర్శనతో రైతుల నుండి సంతకాల సేకరణ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా రైతు పంటలకు అందాల్సిన రైతుబంధును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగగొట్టడం రైతుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తుందని పిడుగు సామి అన్నారు. శనివారం జైనథ్ మండలంలో రైతులకు అండగా నిలబడుతూ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. అర్థనగ్న ప్రదర్శనతో సంతకాల సేకరణ చేపట్టి కాంగ్రెస్ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. రైతు కుటుంబాలను కలుస్తూ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని భరోసా కల్పించారు. రైతుల పక్షాన మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో గవర్నర్కు సంతకాల సేకరణ ద్వారా విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన ప్రతిసారి జోగు రామన్న ఆధ్వర్యంలో నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపట్టి రైతులకు అండగా ఉంటామని అన్నారు.
Admin
Studio18 News