Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు త్వరలో కోలుకొని ప్రజాసేవకు ప్రజా క్షేత్రంలోకి రావాలని కోరుతూ లక్షేటిపేట మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో మరియు ఇటిక్యాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ కు చిన్న కాలికి గాయమై గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారు త్వరగా కోలుకొని ప్రజల సేవకై త్వరగా కోలుకొని రావాలని కార్యకర్తలతో ప్రత్యేక పూజలు నిర్వహించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షేటిపేట మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News