Sunday, 08 March 2026 03:49:52 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Ganesh Nimajjanam: గణనాథుల నిమజ్జన వేడుకల్లో పాల్గొనే భక్తులకు గుడ్‌న్యూస్‌

Date : 17 September 2024 11:49 AM Views : 495

Studio18 News - TELANGANA / : Hyderabad Metro : గణేశ్ ఉత్సవాల్లో చివరి అంకమైన గణనాథుల నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ యంత్రాంగం ప్రతిష్ట ఏర్పాట్లు చేసింది. విగ్రహాల ఊరేగింపు, ట్రాఫిక్, శాంతిభద్రతల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించారు. ముఖ్యంగా ట్రాంక్ బండ్ పై వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు నిమజ్జనోత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం మెట్రో, ఎంఎంటీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. నిమజ్జన వేడుకలకు తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. గణనాథుల నిమజ్జన వేడుకలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం మంగళవారం అర్ధరాత్రి 1గంట నుంచి తెల్లవారు జామున 2గంటల వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయని మెట్రో నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ స్టేషన్ నుంచి అర్ధరాత్రి 1గంటలకు బయలుదేరి 2గంటలకు చివరి స్టేషన్లకు మెట్రో రైళ్లు చేరుకుంటాయని చెప్పారు. ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం, జేబీఎస్ – ఎంజీబీఎస్ కారిడార్ లలో ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు సర్వీసులను ప్రవేశపెడతున్నారు. లింగంపల్లి – ఫలక్ నూమా, నాంపల్లి – లింగంపల్లి, సికింద్రాబాద్ – నాంపల్లి, ఫలక్ నుమా – సికింద్రాబాద్ తదితర రూట్లలో బుధవారం తెల్లవారు జాము వరకు అందుబాటులో ఉండేవిధంగా ఎనిమిది ఎంఎంటీఎస్ సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు గ్రేటర్ ఆర్టీసీ కూడా గణనాథుల నిమజ్జనోత్సవంలో పాల్గొనే భక్తులకు ప్రత్యేక బస్సులను నడపనుంది. సుమారు 600 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికులు ఇళ్లకు చేరే వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇందిరాపార్కు, ఖైరతాబాద్, లక్డీకాపూల్, బషీర్ బాగ్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :