Wednesday, 26 March 2025 04:52:04 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

Ganesh Nimajjanam: గణనాథుల నిమజ్జన వేడుకల్లో పాల్గొనే భక్తులకు గుడ్‌న్యూస్‌

Date : 17 September 2024 11:49 AM Views : 91

Studio18 News - TELANGANA / : Hyderabad Metro : గణేశ్ ఉత్సవాల్లో చివరి అంకమైన గణనాథుల నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ యంత్రాంగం ప్రతిష్ట ఏర్పాట్లు చేసింది. విగ్రహాల ఊరేగింపు, ట్రాఫిక్, శాంతిభద్రతల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించారు. ముఖ్యంగా ట్రాంక్ బండ్ పై వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు నిమజ్జనోత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం మెట్రో, ఎంఎంటీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. నిమజ్జన వేడుకలకు తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. గణనాథుల నిమజ్జన వేడుకలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం మంగళవారం అర్ధరాత్రి 1గంట నుంచి తెల్లవారు జామున 2గంటల వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయని మెట్రో నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ స్టేషన్ నుంచి అర్ధరాత్రి 1గంటలకు బయలుదేరి 2గంటలకు చివరి స్టేషన్లకు మెట్రో రైళ్లు చేరుకుంటాయని చెప్పారు. ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం, జేబీఎస్ – ఎంజీబీఎస్ కారిడార్ లలో ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు సర్వీసులను ప్రవేశపెడతున్నారు. లింగంపల్లి – ఫలక్ నూమా, నాంపల్లి – లింగంపల్లి, సికింద్రాబాద్ – నాంపల్లి, ఫలక్ నుమా – సికింద్రాబాద్ తదితర రూట్లలో బుధవారం తెల్లవారు జాము వరకు అందుబాటులో ఉండేవిధంగా ఎనిమిది ఎంఎంటీఎస్ సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు గ్రేటర్ ఆర్టీసీ కూడా గణనాథుల నిమజ్జనోత్సవంలో పాల్గొనే భక్తులకు ప్రత్యేక బస్సులను నడపనుంది. సుమారు 600 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికులు ఇళ్లకు చేరే వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇందిరాపార్కు, ఖైరతాబాద్, లక్డీకాపూల్, బషీర్ బాగ్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :