Thursday, 12 March 2026 04:14:04 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Revanth Reddy: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Date : 09 September 2025 08:19 PM Views : 277

Studio18 News - TELANGANA / HYDERABAD : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 105 యంగ్ ఇండియా మోడల్ స్కూళ్లకు ఆర్థిక సాయంపై వినతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసమే స్కూళ్లు అని వెల్లడి గత ప్రభుత్వ అధిక వడ్డీ అప్పుల భారంపై కేంద్రానికి వివరణ అప్పుల రీస్ట్రక్చరింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరిన సీఎం భేటీలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లతో పాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న విద్యా పథకాలకు కేంద్ర సహకారం కోరుతూ ఆయన రెండు కీలక ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందుంచారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. గత ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో విచక్షణారహితంగా అధిక వడ్డీలకు చేసిన అప్పులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ అధిక వడ్డీల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న అప్పులను రీస్ట్రక్చరింగ్ (పునర్‌వ్యవస్థీకరణ) చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించి, రాష్ట్రానికి సహకరించాలని కోరారు. అదేవిధంగా, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో 'యంగ్ ఇండియా మోడల్ స్కూళ్ల'ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించాలని నిర్మలా సీతారామన్‌ను ఆయన అభ్యర్థించారు. ఈ రెండు అంశాలపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు సమావేశం అనంతరం సీఎం పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :