Saturday, 07 March 2026 08:48:47 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

కార్ల కంటైనర్‌లో మంటలు, 8 కార్లు దగ్ధం..

కొత్త కార్లను తరలిస్తున్న కంటైనర్ లో మంటలు

Date : 10 November 2024 05:45 PM Views : 530

Studio18 News - TELANGANA / : కొత్త కార్లను తరలిస్తున్న కంటైనర్ లో మంటలు చెలరేగి.. 8 కార్లు దగ్దమయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ లో చోటు చేసుకుంది. ముంబై నుంచి కార్లను తరలిస్తున్న కంటైనర్.. జహీరాబాద్ బైపాస్ రోడ్డు వద్దకు రాగానే..ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్.. కంటైనర్ ను పక్కకు నిలిపి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే పూర్తిగా మంటలు కంటైనర్ అంతా వ్యాపించాయి. అందులో ఉన్న 8 కొత్త కార్లు మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మంటలను ఆర్పే క్రమంలో కంటైనర్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. డ్రైవర్ ను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ కు కంటైనర్ లో కార్లను తరలిస్తున్నారు. ఆ కంటైనర్ అగ్నిప్రమాదానికి గురైంది. డ్రైవర్ కు కంటైనర్ కు మధ్యలో స్పార్క్ రావడంతో మంటలు చెలరేగాయని, చూస్తుండగానే మంటలు పూర్తిగా వ్యాపించాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కంటైనర్ లో కొత్త కార్లు మంటల్లో కాలిపోయాయి. మంటల్లో చిక్కుకున్న కంటైనర్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. డ్రైవర్ ను జహీరాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కార్ల కంటైనర్ లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ మంటలు చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :