Sunday, 29 March 2026 05:18:59 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Revanth Reddy: కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారు?: రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

Date : 04 February 2026 08:04 PM Views : 46

Studio18 News - TELANGANA / HYDERABAD : పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపాటు మొగుడు పెళ్లాం మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆగ్రహం బీఆర్ఎస్ నాయకులు దోపిడీదారులు అంటూ విమర్శలు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిర్యాలగూడ మండలం గూడురులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని మండిపడ్డారు. ఆస్తులు సంపాదించుకున్నా మనం ఏమనలేదని, కానీ పెళ్లాం, మొగుడు మాట్లాడుకుంటే కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర పదజాలం ఉపయోగించారు. జడ్జిలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులు, సినిమా తారలను ఎవరినీ వదలలేదని విమర్శించారు. ఎవరు ఫోన్లో మాట్లాడుకుంటే బీఆర్ఎస్ నాయకులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు కేసీఆర్, ఆయన కుటుంబానికి దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చిందని అన్నారు. "జాతిపితకు నోటీసులు ఇస్తారా" అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారని, ఆయన ఎవరికి జాతిపిత అని నిలదీశారు. మీ నాయకులకు మీరు జాతిపిత కావొచ్చు కానీ మాకెందుకు అవుతారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం సర్వం ధారపోసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతారని, లేదంటే ఏపీలో అధికారం పోయినా పర్వాలేదని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ తల్లి అవుతుంది తప్ప మీలాంటి దోపిడీదారు తెలంగాణ జాతిపిత ఎలా అవుతారని రేవంత్ రెడ్డి నిలదీశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :