Sunday, 29 March 2026 03:18:52 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

వేతనాల జాప్యంపై మణుగూరులో కార్మికుల నల్ల నిరసన

Date : 28 March 2026 11:05 PM Views : 6

Studio18 News - TELANGANA / HYDERABAD : వేతనాల జాప్యాన్ని నిరసిస్తూ కార్మికులు నల్ల నిరసన చేపట్టారు. మణుగూరు రైల్వే సైడింగ్‌లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. నెలాఖరువుతున్నా ఫిబ్రవరి జీతాలు అందలేదని ఐఎఫ్టీయూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మార్చి 28: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ మణుగూరు ఏరియా రైల్వే సైడింగ్ కార్మికులు శనివారం వినూత్న నిరసన చేపట్టారు. గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఐఎఫ్టీయూ) పిలుపు మేరకు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు. తమ శ్రమకు తగ్గ ఫలితం సకాలంలో అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.డి. నాసర్ పాషా మాట్లాడుతూ ప్రతి నెల 7వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, కొందరు కాంట్రాక్టర్లు వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మార్చి నెల ముగిసే సమయానికి కూడా ఫిబ్రవరి నెల జీతాలు కార్మికుల ఖాతాల్లో జమ కాలేదని తెలిపారు. వేతనాలు అందకపోవడంతో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కాంట్రాక్టర్లపై యాజమాన్యం చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ, అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని విమర్శించారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఐఎఫ్టీయూ నాయకులు కుంటా రవి, జి. నాగేశ్వరరావు, కె. వీర్రాజు, ఎం. సాంబశివరావు, కె. నాగేశ్వరరావు, ఎం. భావ్ సింగ్, రామకృష్ణ, రజబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :