Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండలంలో గల శ్రీరాములవారి ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామ స్వామి, లక్ష్మణ, ఆంజనేయ స్వాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆలయ కమిటీ సమర్పించింది. శ్రీసీతారాముల, లక్ష్మణ, ఆంజనేయ స్వాముల మూర్తులను కళ్యాణ మండపానికి భాజా భజంత్రీలతో తీసుకువచ్చి ఆలయ అర్చకులు, భక్తులతో కలిసి అంగరంగ వైభవంగా కనుల పండుగలా శ్రీసీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో కళ్యాణంలో కూర్చొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా సౌకర్యాలను ఆలయ కమిటీ కల్పించింది. ఈ కార్యక్రమంలో ధర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల భక్తులు పాల్గొని దేవుని కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమంలో ఇతరులు కూడా పాల్గొన్నారు.
Admin
Studio18 News