Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హొన్నాజిపేట్ అటవీ ప్రాంతంలో గల శ్రీరాముల పాదాల ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం, యజ్ఞ హోమాలు, అన్నదానం కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ చిన్న బాల్రాజ్, పురోహితులు, రెండు మండలాల ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Admin
Studio18 News