Sunday, 25 January 2026 06:04:46 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Kishan Reddy: కొండా సురేఖ వివాదం.. హైడ్రాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Date : 03 October 2024 12:48 PM Views : 485

Studio18 News - TELANGANA / : Kishan Reddy: పేదలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతాపం చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేయాలని ఆలోచించింది.. ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వెనక్కి తగ్గిందని కిషన్ రెడ్డి అన్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కరించకుండానే మూసీ సుందరీకరణ చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తాగునీరు, డ్రైనేజీ కలిసి ప్రజల రోగాల భారిన పడుతున్నారని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆవేదనను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించడం న్యాయం కాదు.. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని ప్రభుత్వాన్ని కోరామని.. విధ్వంసాన్ని ఆపాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కొండా సురేఖ కేటీఆర్ వివాదంపై కిషన్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. మర్యాదపూర్వకంగా మాట్లాడని నేతలను మీడియా సంస్థలు బహిష్కరించాలని కోరారు. కుటుంబ వ్యవహారాలు, వ్యకిగత విషయాలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరం. ఒకరి సంభాషణను వినడం తప్పు. భార్యాభర్తలు, వ్యాపార వేత్తలు, సెలబ్రెటీలను టార్గెట్ చేశారు. కేటీఆర్ మొదలు పెట్టిండు.. రేవంత్ కొనసాగిస్తుండని కిషన్ రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయితే అడ్డూఅదుపు లేదన్న కిషన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి భాష చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :