Studio18 News - TELANGANA / HYDERABAD : మందమర్రిలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తన సతీమణితో కలిసి శ్రీరామనవమి సందర్భంగా పలు ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మందమర్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంచిర్యాల్ జిల్లా మందమర్రి పాలచెట్టు పంచముఖి ఆంజనేయ దేవాలయం, యపాల్ కోదండ రామాలయం, లోమూడవ జూన్ రామాలయం వంటి ఆలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణానికి మంత్రి వివేక్ వెంకటస్వామి సరోజ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రధాన అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. శ్రీరామనవమి కల్యాణం పంచముఖి హనుమాన్ దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ బస్తీల నుండి భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తరలారు. మిథిలా స్టేడియంలో భక్తుల సౌకర్యార్థం షామియానాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. శిల్ప కళాశోభిత కల్యాణ మండపాన్ని రంగురంగుల పూలమాలలతో అందంగా అలంకరించారు. సీతారాముల కల్యాణ మహోత్సవంలో ముత్యాల తలంబ్రాలు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సరోజ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించి అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ప్రధాన అతిధిగా మందమర్రి జియం N. రాధకృష్ణ శ్రీవాణి, యూనియన్ నాయకులు, సింగరేణి అధికారులు, కార్మికులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం మినిస్టర్ వివేక్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీరాముడు నీతి, నిజాయితీతో ఎలా జీవించారో ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పలు పథకాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 500 రూపాయల బోనస్, అన్న బియ్యం, ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం, ఉద్యోగ అవకాశాలు, కొత్త గనులు తెచ్చి ప్రజలకు మేలు చేకూర్చే పనులు చేపడుతోందని తెలిపారు.
Admin
Studio18 News