Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ సందర్భంగా సీఎం A. Revanth Reddy, స్థానిక శాసనసభ్యుడు R. Bhupathi Reddy ఆదేశాలతో ముస్లిం సోదరులకు ప్రతి సంవత్సరం తోఫా అందించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ధర్పల్లి మండల కేంద్రంలోని ముస్లింల పవిత్ర స్థలం మసీదులో స్థానిక సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ధర్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి రంజాన్ తోఫా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, నర్సయ్య, చిన్నారెడ్డి, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News