Sunday, 16 March 2025 03:28:53 PM
# Omar Abdullah: జమ్మూకశ్మీర్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఒమర్ అబ్దుల్లా # AP Govt: ఏపీ స‌ర్కార్ ఆసక్తికర నిర్ణ‌యం... ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు అవార్డులు! # Pawan Kalyan: ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి # Chegondi Harirama Jogaiah: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు హరిరామజోగయ్య బహిరంగ లేఖ # Nara Lokesh: ఆల్ఫా హోటల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగిన నారా లోకేశ్ # Donald Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం... పాక్ స‌హా 41 దేశాల‌పై ట్రావెల్ బ్యాన్‌...? # Pawan Kalyan: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే స్పందన # Revanth Reddy: చంద్రశేఖర్ రావ్... నీ పిల్లలకు చెప్పు... మాట జారితే ఫలితం అనుభవిస్తారు: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ # దేశంలో కులగణన చేయాలని ఎన్డీయే ప్రభుత్వానికి డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్న మాయావతి సమగ్ర అభివృద్ధి కోసం జనగణన అవసరమని వ్యాఖ్య # Sovereign Bonds: వారి పంట పండింది... రూ.1 లక్షకు రూ.3 లక్షలు ఇవ్వనున్న ఆర్బీఐ # మ‌రో వారం రోజుల్లో ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న‌ ఐపీఎల్ 2025 2008లో ప్రారంభ‌మైన క్యాష్ రిచ్ లీగ్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా # త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి హిందీని బలవంతంగా రుద్దుతున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన పునర్విభజనతో సీట్లు తగ్గవన్న కిషన్ # విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఉబర్ ఒప్పందం ముంబై ప్రయాణికుల కోసం ప్రత్యేక పథకం # కేసీఆర్ ను మార్చురీకి పంపిస్తామని రేవంత్ అన్నారన్న హరీశ్ రావు తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం దారుణమని వ్యాఖ్య చంద్రబాబుని # వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు వివిధ డిమాండ్లపై ఐబీఏతో చర్చలు చర్చలు సఫలం కాలేదని యూఎఫ్‌బీయూ వెల్లడి సమ్మెకు పిలుపునిచ్చిన తొమ్మిది బ్యాంకు ఉద్యోగ # Supritha: క్షమాపణ చెప్పిన సురేఖావాణి కూతురు సుప్రీత... కారణం ఇదే! # Pochampalli Srinivas Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు # Daggubati Purandeswari: పవన్ కల్యాణ్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు # Bank: ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకర్ల దేశవ్యాప్త సమ్మె: యూఎఫ్‌బీయూ # Chiranjeevi: తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నా తమ్ముడు నాగేంద్రబాబుకు అభినందనలు: చిరంజీవి

తెలంగాణ గట్టు మీద చంద్రబాబు స్కెచ్‌

పూర్వవైభవం కోసం సరికొత్త వ్యూహాలు

Date : 05 January 2025 10:25 AM Views : 74

Studio18 News - TELANGANA / HYDERABAD : సైకిల్‌ పంక్చర్ అయింది..చైన్ కూడా తెగిపోయింది. ఎంత తొక్కినా ముందుకు కదలదనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పడిలేచిన కెరటమై.. పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ప్రయత్నం మొదలుపెట్టబోతుందట పసుపు పార్టీ. ఒకప్పుడు నైజాం గడ్డ మీద ప్రభంజనం సృష్టించిన టీడీపీ..పూర్వవైభవం కోసం సరికొత్త వ్యూహాలు రెడీ చేస్తోందట. సైకిల్‌ పార్టీ తెలంగాణలో మళ్లీ సవారీ చేయబోతుందా? తెలంగాణ గట్టు మీద చంద్రబాబు వేస్తున్న స్కెచ్‌ ఏంటి? సర్పంచ్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ? తెలంగాణపై మళ్లీ ఫోకస్ పెట్టారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో డీలా పడ్డ పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా అడుగులు వేస్తున్నారట. సంక్రాంతి తర్వాత పూర్తిస్థాయిలో తెలంగాణ మీదే నజర్ పెట్టబోతున్నారట. జనవరి చివరి కల్లా తెలంగాణ టీడీపీ అధ్యక్ష నియామకం చేపట్టి, కార్యవర్గాన్ని ప్రకటించాలని భావిస్తున్నారట చంద్రబాబు. త్వరలో తెలంగాణలో జరగనున్న సర్పంచ్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారట చంద్రబాబు. ఇందులో భాగంగా ప్రతీ 15-20 రోజులకు ఒకసారి హైదరాబాద్‌లో నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా తర్వాత తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు లేకుండా పోయారు. అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా టీటీడీపీకి వెంటనే అధ్యక్షుడిని నియమించడంతో పాటు పూర్తిస్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.

Also Read : తెలంగాణ కాంగ్రెస్ సర్కారుపై బండి సంజయ్ విమర్శలు

సంక్రాంతి తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకం..! గత కొన్ని రోజులుగా టీటీడీపీ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ కార్యవర్గంపై చేస్తున్న కసరత్తు..ఫైనల్‌ స్టేజ్‌కు చేరుకుందని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్ష్యుడ్ని నియమిస్తారని టాక్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు సాగుతుండగా, జనవరి మూడో వారంలో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారని తెలుస్తోంది.

టీటీడీపీ అధ్యక్షుడిగా తీగల కృష్ణారెడ్డికి పగ్గాలు? తెలంగాణ టీడీపీకి ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలన్న దానిపై సమాలోచన చేసిన చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న అరవింద్ కుమార్ గౌడ్‌తో పాటు పార్టీలో చేరబోతున్న తీగల కృష్ణారెడ్డి, ఇటీవల పార్టీ సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్‌లు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారట. అయితే హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డివైపే చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత టీటీడీపీ అధ్యక్షుడిగా తీగల కృష్ణారెడ్డికి పగ్గాలు అప్పగించడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటుడు, మాజీమంత్రి బాబు మోహన్‌ను టీటీడీపీ వర్కింగ్ ప్రెసిండెంట్‌గా..అరవింద్ కుమార్ గౌడ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే తీగల కృష్ణారెడ్డి చంద్రబాబును కలిశారు. తాను త్వరలో టీడీపీలో చేరుతానని ఆయన ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్నారని.. త్వరలోనే పార్టీకి గత వైభవం తీసుకొస్తానన్నారు. తీగల కృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే స్టార్ట్ అయింది. టీడీపీ కార్పొరేటర్‌గా గెలిచి హైదరాబాద్‌ మేయర్‌గా పని చేశారాయన. దాంతో తిరిగి సొంత గూటికి చేరి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు తీగల కృష్ణారెడ్డి. వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి అభిమానులు బానే ఉన్నారు. హైదరాబాద్‌, ఖమ్మంలో టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ కోర్‌ ఓటు బ్యాంకైన కమ్మ ఓటర్లు హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తారు. మరికొన్ని సెగ్మెంట్లలో సెటిలర్ల ఓట్లు ఎక్కువగానే ఉంటాయి. ఖమ్మంలోనూ కమ్మ ఓటర్లు ఉండటం..విజయవాడకు బార్డర్‌గా ఉన్న జిల్లా కావడంతో అక్కడ కూడా టీడీపీకి అంతో ఇంతో పట్టుంది. తెలంగాణలో ప్రభావం చూపేంతగా బలపడాలనే భావన.. అయితే గెలిచేంత పట్టు ఉందా లేదా అన్నదే చర్చ. ఎలా అయినా తెలంగాణలో ప్రభావం చూపేంతగా బలపడాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టగా..కనీసం 10 లక్షల మందిని సభ్యులుగా చేర్పించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తెలంగాణలో జరిగే సర్పంచ్ ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :