Friday, 14 February 2025 07:59:20 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలతో దాడి.. కమలాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత

Date : 24 January 2025 02:39 PM Views : 62

Studio18 News - TELANGANA / HANUMAKONDA : హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై దాడి జరిగింది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపై టమాటాలతో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలు విసిరేశారు. పోటాపోటీగా ఇరువర్గాల నినాదాలతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామసభలో చోటు చేసుకుంది.

Also Read : #chittoor : ప్రభుత్వ లాంఛనాలతో అమర జవాన్ అంత్యక్రియలు

హన్మకొండ జిల్లా కమలాపూర్ లో గ్రామసభను ఏర్పాటు చేశారు. గ్రామసభకు పెద్దెత్తున గ్రామస్తులతోపాటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికూడా ఈ గ్రామ సభలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ పై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులను ప్రశ్నించడంతో.. అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ హయాంలో ఎంత మందికి ఇళ్లు ఇచ్చారు.. ఎందుకు ప్రశ్నిస్తున్నారు.. ఎందుకు ప్రస్తుతం ఇళ్లు రాకుండా అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా గ్రామసభలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపై టమాటాలను విసిరేశారు. దీంతో కౌశిక్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదేసమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలను కాంగ్రెస్ నేతలపైకి విసిరివేయడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని ఇరువర్గాలను నిలువరింపజేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పెద్దెత్తున నినాదాలు చేశారు. ఇరువర్గాలకు సర్ధిచెప్పిన పోలీసులు సభ నుంచి వారిని పంపించివేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :