Studio18 News - TELANGANA / MANCHERIAL : బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో అమృత్ 2.0 పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంకు మరియు ఇతర నిర్మాణ పనులను మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావ్ స్వాతి, కమిషనర్ రమేష్ బాబు, సంపత్ పాల్గొన్నారు. చర్చల్లో, అమృత్ 2.0 పథకంలో చేపట్టిన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేయగా, అదనపు కలెక్టర్ చంద్రయ్య వేసవి దృష్ట్యా త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అడా ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు సరఫరా అయ్యేలా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Admin
Studio18 News