Thursday, 15 May 2025 03:17:41 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

ఆపరేషన్ సిందూర్ పై కేటీఆర్ స్పందన

Date : 09 May 2025 06:48 PM Views : 20

Studio18 News - TELANGANA / : పాకిస్థాన్‌తో భారతదేశం పోరాడుతున్న ప్రస్తుత తరుణంలో, దేశ సైన్యానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముందు, కేటీఆర్ మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్, దివంగత నేత రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, రైతుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు, కానీ జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం ఏమిటి?" అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అఫిడవిట్లు, బాండ్లు రాసి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన మండిపడ్డారు. రైతు రుణమాఫీ, ఆడబిడ్డలకు తులం బంగారం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన కేటీఆర్, "ఖమ్మం జిల్లా ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్‌కు ఓటేశారు, ఇప్పుడు ఆ మార్పు ఎక్కడ కనబడుతోంది?" అని వ్యాఖ్యానించారు. "మా పరిపాలనపై కొద్దిగా బోర్ కొట్టి, వారికి ఓట్లు వేశారు. ఇప్పుడు ఏమైంది?" అని ప్రజలనుద్దేశించి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని, వారిని నిలదీసి తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. "రేవంత్ రెడ్డి అంత నికృష్ట ముఖ్యమంత్రిని చూడలేదు. ఢిల్లీలో ఆయనకు అపాయింట్‌మెంట్లు దొరకడం లేదని, అక్కడ ఆయన్ను చెప్పులు ఎత్తుకుపోయేవాడిగా, దొంగలా చూస్తున్నారని అంటున్నారు. దొంగను దొంగలా కాకుండా మరెలా చూస్తారు?" అంటూ ఎద్దేవా చేశారు. అంబేద్కర్ కూడా ఇటువంటి దుర్మార్గులు అధికారంలోకి వస్తారని ఊహించి ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో ప్రజలకు మంచి అవకాశం వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నికల కోసం బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్‌గా పనిచేయాలని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలన్నింటినీ గెలుచుకుని గులాబీ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :