Saturday, 07 March 2026 08:32:47 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

హరీశ్ రావును అరెస్టు చేయొద్దు.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రికి స్వల్ప ఊరట చక్రధర్ గౌడ్ కు నోటీసులు పంపిన హైకోర్టు హరీశ్ రావు క్వాష్ పిటిషన్ పై విచారణ

Date : 05 December 2024 01:00 PM Views : 493

Studio18 News - TELANGANA / : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు హరీశ్ రావుపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు గురువారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాఫ్తులో పోలీసులకు సహకరించాలని హరీశ్ రావుకు సూచించింది. ఈ వ్యవహారానికి సంబంధించి చక్రధర్ గౌడ్ కు నోటీసులు జారీ చేసింది. పంజాగుట్ట పోలీసులు తనపై నమోదు చేసిన కేసు రాజకీయ కక్షలో భాగమని ఆరోపిస్తూ హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు కథనాల ఆధారంగా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆయన అభ్యర్థించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడో జరిగిపోయిన వ్యవహారమని గుర్తుచేస్తూ చక్రధర్ గౌడ్ ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడం వెనక రాజకీయ కక్ష సాధింపు కోణం ఉందని వాదించారు. ఫిర్యాదులోని అంశాలపై కనీసం ప్రాథమిక విచారణ కూడా జరపకుండా పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అరెస్టు చేస్తే తన రాజకీయ జీవితం, వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతింటాయని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ పై ఫిర్యాదు జరిపిన హైకోర్టు.. తాజాగా హరీశ్ రావుకు ఊరట కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది.

Also Read : యాడ్స్ లో ధోని హవా.. బాలీవుడ్ స్టార్లకు మించి క్రేజ్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :