Tuesday, 10 February 2026 03:59:19 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి

Date : 09 February 2026 07:00 PM Views : 19

Studio18 News - TELANGANA / HYDERABAD : ఆయన దేశానికి ప్రధానమంత్రి కాబట్టి బడాబాయే అన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం ఈగిల్ టీమ్‌కు చెప్పవలసి వస్తుందేమోనన్న ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రి కాబట్టి ఆయన కచ్చితంగా బడాబాయినే అని, ముఖ్యమంత్రి చోటాబాయి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని బడాబాయి అన్నారు కదా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ముఖ్యమంత్రి స్పందించారు. ప్రధాని కాబట్టి ఆయన బడాబాయే అని చెప్పారు. ఇంగ్లీష్‌లో బిగ్ బ్రదర్ అంటారని, తాను హిందీలో చెప్పానని అన్నారు. 'మీరు టీ న్యూస్ జర్నలిస్టు అయినంత మాత్రాన మీ ముఖంలో నేను కేసీఆర్‌ను చూడను కదా. జర్నలిస్టుగానే చూస్తాను. అలాగే ప్రధానిని ప్రధానిగానే చూస్తాను.. ఆయన పెద్దన్నే' అని అన్నారు. మీ సారంతా ఇంగ్లీష్ నాకు రాదంటూ టీన్యూస్ జర్నలిస్టును ఉద్దేశించి ముఖ్యమంత్రి సరదాగా అన్నారు. ఈగల్ టీమ్‌కు చెప్పాలేమో పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ చేసిందేమీ లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ పదేళ్లు నిధులు, అధికారం వారి చేతిలోనే ఉందని, అప్పుడేం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని రావడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల చేతుల్లోనే కీలక శాఖలు ఉన్నాయని గుర్తు చేశారు. వారు ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే వచ్చేదేమీ లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ ఇప్పటి వరకు సభకు రాలేదని, ఇప్పుడు వార్డుల్లో బీఆర్ఎస్ వారిని గెలిపిస్తే వారు అభివద్ధిని అడ్డుకుంటారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల్లో అహంకారం, విషం చిమ్మడం, విద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు తప్ప ఏమీ లేదని అన్నారు. వారు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, చూస్తుంటే వారి గురించి ఈగల్ టీమ్ గురించి చెప్పాలేమోనని అన్నారు. గంజాయి లేదా కొకైన్ తీసుకుని మాట్లాడుతున్నారా అని అడగాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మానసిక రోగం, ఉన్మాదంతో అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ 2014 నుంచి 2022 వరకు బీజేపీ తెచ్చిన ప్రతి చట్టానికి మద్దతు పలికిందని ఆరోపించారు. 2014 నుంచి 2021 వరకు రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదని, కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. నోట్ల రద్దు అద్భుతమని సభలో కేసీఆర్ చెప్పారని, జీఎస్టీని అభినందించారని అన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారని, కానీ చర్యలేమీ తీసుకోలేదని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :