Sunday, 08 March 2026 04:39:46 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Mallu Bhatti Vikramarka: జపాన్ వెళ్లిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Date : 01 October 2024 11:32 AM Views : 606

Studio18 News - TELANGANA / : తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే వారం రోజుల పాటు అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న ఆయన మూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్న మధ్యాహ్నం జపాన్‌కు చేరుకున్నారు. భట్టి విక్రమార్క బృందానికి హానిడా ఎయిర్ పోర్టులో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు అజయ్ సేథి, మధుసూధన్, అమన్ ఆకాష్ స్వాగతం పలికారు. అనంతరం జపాన్ దేశంలో గల పరిశ్రమలు, తెలంగాణలో పెట్టుబడులకు, భాగస్వామ్య పరిశ్రమలకు గల అవకాశాలపై భారత రాయబారి సిబి జార్జి ఆధ్వర్యంలో అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టికి సంక్షిప్తంగా వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి గౌరవార్ధం భారత రాయబార కార్యాలయంలో విందు ఏర్పాటు చేశారు. ఈ బృందంలో భట్టి విక్రమార్క వెంట ఆర్ధిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి డి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ ఉన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా ఈ బృందం పర్యావరణ రహిత పరిశ్రమలు, అత్యాధునిక మైనింగ్ సంబంధిత టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాల పరిశీలన కోసం ప్రముఖ పరిశ్రమలను సందర్శించడంతో పాటు వివిధ దిగ్గజ కంపెనీలతో భేటీ కానున్నది. తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్ పరిశ్రమలకు తోడ్పాటు, వివిధ పరిశ్రమల్లో భాగస్వామ్యం తదితర అంశాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి .. ఆ దేశ ప్రముఖ కంపెనీల పారిశ్రామికవేత్తల సమావేశాల్లో చర్చించనున్నారు. భట్టి జపాన్ పర్యటన షెడ్యూల్ ఇలా అక్టోబర్ 1వ తేదీ (మంగళవారం) ఉదయం పెట్టుబడులతో వచ్చే కంపెనీలతో రౌండ్ టేబుల్ సమావేశం, వివిధ పారిశ్రామిక వేత్తలతో విడివిడిగా భేటీలు. సాయంత్రం యామాంషి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ సందర్శన. 2వ తేదీ (బుధవారం) తోషిబా, కవాసాకి, యాక్లహామ పరిశ్రమల సందర్శన. రాత్రికి ఒకాసలో బస 3వ తేదీ (గురువారం) పానాసోనిక్ హెడ్ క్వార్టర్స్ సందర్శన. అనంతరం తెలంగాణకు తిరుగు ప్రయాణం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :