Wednesday, 11 March 2026 11:42:40 AM
# సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన # అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరికు బెస్ట్ టీచర్ అవార్డు # టేకులబస్తిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ స్లాబ్ పనులు ప్రారంభం # విలేకరి చంద్రశేఖర్‌పై నమోదైన కేసు రద్దు చేయాలి: బీజేపీ నాయకుడు కొయ్యల ఏమాజి # బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ కూనురాజుల సమ్మక్కకు పిహెచ్డీ డాక్టరేట్ # మందమర్రి పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం… మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనం # నాగర్ గూడ శివారులో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం # బీజేపీ పోరాటంతో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు # కోమట్లగూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం # కుషాయిగూడలో ఘనంగా రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం

మందమర్రి పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం… మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనం

Date : 11 March 2026 07:59 AM Views : 29

Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల జిల్లా: మందమర్రి మార్కెట్ ఆస్ర పెద్ద మసీదులో రంజాన్ పండుగను పురస్కరించుకుని రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన మంత్రి, కలెక్టర్ అనంతరం 112 మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. చెన్నూరు, మందమర్రిలో కోటి రూపాయలతో షాదీఖానాలు, ఖబరస్తాన్‌లను నిర్మిస్తున్నామని తెలిపారు. మందమర్రిలో ఖబరస్తాన్ ప్రహరీ నిర్మాణానికి 15 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా ATC సెంటర్‌లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 300 బోర్లు వేసినట్లు వెల్లడించారు. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ నేపథ్యంలో 100 కోట్లతో అమృత్ స్కీమ్ పథకం ద్వారా చెన్నూరు నియోజకవర్గంలో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. మందమర్రిలో పట్టా భూములు ఉన్న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని మంత్రి తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :