Friday, 14 February 2025 06:50:00 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

#RajannaSircilla : వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించాలి

వేములవాడ ఎం ఎల్ ఏ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Date : 24 January 2025 12:14 AM Views : 47

Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని వేములవాడ ఎం ఎల్ ఏ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి అద్వర్యలో నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు 2025లో భాగంగా నిర్వహిస్తున్న సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమంను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆర్ టి సి బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు రోడ్డు ఎక్కిన నుండి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా వచ్చేలా జాగ్రత్తగా వాహనాలు నడపాలని, మద్యం సేవించి, సెల్ ఫోన్ లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే వారి కుటుంబ సభ్యులు కుటుంబ పెద్దను కోల్పోతారని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు పెద్ద పీట వేస్తుందన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన కొంత మందిలో అయిన మార్పు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నారన్నారు. ఆటో యూనియన్ వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని,ఇల్లు లేని ఆటో కార్మికులకు ఇందిరమ్మ మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.

Also Read : #RajannaSircilla : ఆందోళనల మధ్య గ్రామసభల నిర్వహణ..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :