Monday, 23 June 2025 02:39:35 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

#RajannaSircilla : వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించాలి

వేములవాడ ఎం ఎల్ ఏ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Date : 24 January 2025 12:14 AM Views : 175

Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని వేములవాడ ఎం ఎల్ ఏ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి అద్వర్యలో నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు 2025లో భాగంగా నిర్వహిస్తున్న సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమంను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆర్ టి సి బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు రోడ్డు ఎక్కిన నుండి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా వచ్చేలా జాగ్రత్తగా వాహనాలు నడపాలని, మద్యం సేవించి, సెల్ ఫోన్ లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే వారి కుటుంబ సభ్యులు కుటుంబ పెద్దను కోల్పోతారని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు పెద్ద పీట వేస్తుందన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన కొంత మందిలో అయిన మార్పు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నారన్నారు. ఆటో యూనియన్ వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని,ఇల్లు లేని ఆటో కార్మికులకు ఇందిరమ్మ మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.

Also Read : #RajannaSircilla : ఆందోళనల మధ్య గ్రామసభల నిర్వహణ..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :