Monday, 08 December 2025 03:45:19 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

రేవంత్ రెడ్డిపై పరువు నష్టం కేసు... బీజేపీ నేత వాంగ్మూలం నమోదు చేసిన కోర్టు

ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్లు ఎత్తేస్తారని ప్రచారం చేశారని పిటిషన్ పరువు నష్టం కేసు వేసిన బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు వాంగ్మ

Date : 21 November 2024 03:49 PM Views : 415

Studio18 News - TELANGANA / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై ఈరోజు నాంపల్లి హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లను ఎత్తేస్తారని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాసం వెంకటేశ్వర్లు కోర్టుకు వెళ్లారు. సీఎంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‍‌లో కోరారు. ఈ నేపథ్యంలో ఈరోజు వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేసిన అబద్ధపు ప్రచారం వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. మే 4వ తేదీన కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. బీజేపీ నేత పరువు నష్టం దావా నేపథ్యంలో కోర్టు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

Also Read : విజయసాయిరెడ్డిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్... విచారణ వాయిదా

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :