Monday, 08 December 2025 03:08:15 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

KTR: దండగమారి పాలనలో పండుగపూట కూడా పస్తులే: కేటీఆర్

Date : 08 October 2024 04:50 PM Views : 326

Studio18 News - TELANGANA / : దండగమారి పాలనలో పండుగ పూట కూడా పస్తులేనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఉద్యోగులకు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన దసరా దగ్గరకు వచ్చినప్పటికీ ఉద్యోగుల చేతిలో డబ్బులు లేక సరుకులు కొనుగోలు చేయలేకపోతున్నారని రాసుకొచ్చారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఐదారు నెలలుగా జీతాల్లేవ్... పంచాయతీ కార్మికులు... మున్సిపాలిటీ కార్మికులు... ఆసుపత్రి సిబ్బంది... హాస్టల్ వర్కర్స్... గెస్ట్ లెక్చరర్స్... ప్రతీ శాఖలోనూ వేతనాల్లేక చిరుద్యోగులు విలవిల్లాడుతున్నారని పేర్కొన్నారు. కుటుంబాలను నెట్టుకురావడానికి అప్పులు చేసి నానా తిప్పలు పడుతున్నారని రాసుకొచ్చారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని పలికిన ప్రగల్భాలు ఎటు పోయాయని నిలదీశారు. దసరా దగ్గరకు వచ్చినప్పటికీ సరుకులు కొనడానికి ఉద్యోగుల చేతిలో నయాపైసా లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో పెడితే బతుకుబండి ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ 10 నెలల పాలనలో తెచ్చిన రూ.80 వేల కోట్ల అప్పులు ఎక్కడకు పోయాయో చెప్పాలన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చిరుద్యోగులు, చిన్న జీతాల కార్మికుల అవస్థలను దృష్టిలో ఉంచుకొని వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :